Tuesday, April 23, 2024

మైత్రీ మూవీ మేక‌ర్స్ ఒటిటి మూవీ ‘సత్తగాని రెండు ఎకరాలు’

ఆహా ఒరిజినల్‌ ఫిల్మ్‌ ‘సత్తగాని రెండు ఎకరాలు’ను ప్రకటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. అభినవ్‌ దండ దర్శకుడు. కొల్లూరు బ్యాక్‌ డ్రాప్‌తో సినిమా తెరకెక్కుతుంది. ఇందులో పుష్ప ఫేమ్‌ జగదీస్‌ భండారి నటిస్తున్నారు. డార్క్‌ కామెడీ జోనర్‌లో ఎవరరూ ఊహించని ట్విస్టులు, టర్నులతో ప్రేక్షకులను మెప్పించనుంది. వెన్నెల కిషోర్‌ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. సత్తిగాని రెండు ఎకరాలు సినిమా మన మూలాలను గుర్తుకు తెస్తూ మనకు కనెక్ట్‌ అయ్యే చిత్రంగా రూపొందుతుంది.

ఈ సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్‌ మాట్లాడుతూ మా బ్యానర్‌ నుంచి తొలి తెలుగు ఓటీ-టీ- సినిమాను తీసుకు రాబోతున్నాం. ఇది మాకెంతో థ్రిల్లింగ్‌గా ఉంది. ప్రేక్షకులకుమరింత దగ్గర కావటానికి మరో మాధ్యమంలోకి అడుగు పెట్టటమనేది చాలా సంతోషంగా ఉంది. సత్తిగాని రెండు ఎకరాలు పవర్‌ఫుల్‌ స్టోరి లైన్‌తో పాటు- అమేజింగ్‌ మ్యూజిక్‌తో మిళితమై ఉంది. అలాగే ఆహాతో కలిసి ఈ సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది.” అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement