Sunday, March 24, 2024

ఉత్తమ పాలనకు సృష్టికర్త ఎన్టీఆర్.. ఉత్తమ విధ్వంస కారుడు జగన్మోహన్ రెడ్డి : చంద్ర‌బాబు

ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా ఆ మహనీయుడికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయంలో నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం రాష్ట్రంలో నడుస్తోందని, సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఉత్తమ పాలనకు సృష్టికర్త ఎన్టీఆర్ అయితే.. ఉత్తమ విధ్వంస కారుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు భావితరాల భవిష్యత్తు కోసం ఎన్టీఆర్ తపించారన్నారు. జీవితాన్ని ప్రజలకు అంకితమిచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని, రాజకీయాల ద్వారా దేశానికి దశ దిశ నిర్ధేశించిన నాయకుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు కొనియాడారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగా వ్యవహరించిన నిర్లక్ష్యం కారణంగానే కందుకూరు, గుంటూరులలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఓటమి భయంతోనే అధికారపార్టీ పోలీసుల ద్వారా చావు కుట్రలు పన్ని జీవో నెంబర్ 1 తీసుకొచ్చిందన్నారు. ఆ జీవోను ప్రతిఒక్కరూ వ్యతిరేకించారని చంద్రబాబు పేర్కొన్నారు. సీఎం జగన్ చేసిన రూ.10 లక్షల కోట్ల అప్పు ఎవరు కట్టాలని ప్రశ్నించారు. పేదల రక్తాన్ని కూడా జలగలా తాగేస్తున్నారని, ఎన్టీఆర్ సిద్దాంతాలను జయప్రదం చేయాలంటే సైకో పాలన పోవాలని, సైకిల్ పాలన రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement