Saturday, April 20, 2024

అవసరమైనప్పుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారు.. నారా రోహిత్

రాబోయే రోజుల్లో యువగళం పాదయాత్ర దుమ్మురేపుతుందన్నారు నటుడు నారా రోహిత్. టిడిపి యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రకి ఆయన సంఘీభావం ప్రకటించి..పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ… ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్ తగిలిందని, ఆ పార్టీ ఇప్పుడు డిఫెన్స్ లో పడిందని అన్నారు.ఇక స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ఎదురైన ప్రశ్నకు సమాధానంగా… అవసరమైనప్పుడు తారక్ రాజకీయాల్లోకి వస్తారని చెప్పారు. మరోవైపు లోకేశ్ పాదయాత్ర ఇప్పటి వరకు 625 కిలోమీటర్ల మేర కొనసాగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement