Friday, April 19, 2024

వీడిన ఎన్‌ఆర్ఐ డాక్టర్ మిస్సింగ్ మిస్టరీ

హైదరాబాద్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది. నల్గొండ జిల్లాలో సుధీర్‌రెడ్డి బాబాయ్ కుమారుడు ఎన్ఆర్‌ఐ డా.జయశీల్ రెడ్డి అదృశ్యం కలకలం రేపింది. మేళ్లదుప్పలపల్లిలోని తన పొలానికి వచ్చిన జయశీల్ రెడ్డి డ్రైవర్‌ను గెస్ట్ హౌస్‌లో ఉండమని చెప్పి పొలం లోపలకు వెళ్లారు. అయితే కాసేపటికి అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో కుటుంబీకులు ఆందోళనతో వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. అయినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు డాగ్ స్వ్కాడ్‌తో పరిశీలన చేయగా ఓ శునకం వ్యవసాయ క్షేత్రంలోని బావి వద్ద ఆగింది. దీంతో వ్యవసాయ బావిలో జారిపడి ఉంటాడా అన్న అనుమానంతో పోలీసులు బావిలోని నీటిని మోటార్ల ద్వారా తోడిస్తున్నారు. అనుకున్నట్లే జయశీల్ మృతదేహం బావిలో లభ్యమైంది. డెడ్ బాడీని బయటకు తీసిన పోలీసులు.. ఇది హత్యా? లేదా ఆత్మహత్య అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. కాగా జయశీల్ జమైకాలో వైద్యవిద్య పూర్తి చేసి ఇటీవలే ఇండియాకు వచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement