Friday, April 26, 2024

18 డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌పీఎస్‌సీ మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో ఖాళీగా ఉన్న 18 పోస్టుల భర్తీకి టీస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈనెల 16 నుంచి జనవరి 5వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇతర వివరాలకు టీఎస్‌పీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. బుధవారం పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 247 లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement