Friday, April 26, 2024

Delhi | మార్గదర్శి కేసులో ప్రతివాదులకు నోటీసులు.. జులై 18న తదుపరి విచారణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ హైకోర్టులో దాఖలైన మార్గదర్శి కేసులను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జులై 18కు వాయిదా వేస్తూ జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ రాజేశ్ బిందాల్ తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కేసు పూర్వాపరాలను పూర్తిగా వినకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న ధర్మాసనం స్పష్టం చేసింది. అంతవరకూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులన్నీ అమలులో ఉంటాయని తేల్చి చెప్పింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement