Thursday, April 25, 2024

Breaking: వార్ రూం కేసు- మల్లు రవికి నోటీసులు

హైదరాబాద్ – కాంగ్రెస్ వార్ రూం విషయంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మల్లు రవికి నోటీసులు ఇచ్చారు. సైబర్ క్రైం ఎస్ఐ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవికి 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. ఈనెల 12వతేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులో కోరారు.. ఈ కేసుకు సంబంధించి ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్‌ కనుగోలును సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విచారించారు. దాదాపు రెండు గంటల పాటు విచారించిన పోలీసులు సోషల్‌ మీడియా పోస్టులకు సంబంధించిన వివరాలను సునీల్‌ నుంచి సేకరించినట్లు తెలుస్తోంది. మరోసారి సునీల్‌ను విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. విచారణ అనంతరం బయటకు వచ్చిన సునీల్‌ మీడియాతో మాట్లాడటానికి నిరాకరించాడు. ఇది ఇలా ఉంటే వార్ రూం వ్యవహారాలతో సునీల్ కు ఎటువంటి సంబంధం లేదని, ఇస్తే తనకు నోటీసులు ఇవ్వాలని మల్లు రవి సైబర్ పోలీసులను కోరారు..ఈ నేపథ్యంలోనే మల్లు రవికి నోటీసులు అందజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement