Thursday, March 28, 2024

బీఎల్ సంతోష్‎కు మరోసారి నోటీసులు..

తెలంగాణ‌లో ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో సిట్ అధికారుల దర్యప్తు కొనసాగుతోంది. దీనిలో భాగంగా బీఎల్ సంతోష్‎కు మరోసారి నోటీసులు అందించారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో 41 ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. ఈనెల 26న లేదా 28న విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. బీఎల్ సంతోష్ వాట్సాప్, ఈ -మెయిల్ కు సైతం సిట్ అధికారులు నోటీసులు పంపారు. ఇదివరకే ఒకసారి నోటీసులు పంపగా గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్న కారణంగా హాజరుకాలేదని బీజేపీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement