Sunday, March 24, 2024

Breaking: హిందీ కాదు.. దేశవ్యాప్తంగా తమిళ భాషను విస్తరింపజేయాలి: గవర్నర్​ రవి

తమిళ భాషకు ఎంతో ప్రాధాన్యం ఉందని, గొప్ప గొప్ప మేధావులు, ఆధ్యాత్మిక భాషగా తమిళం ఉంది కాబట్టి దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా తమిళ భాషను ఇంప్లిమెంట్​ చేయాలని ఆ రాష్ట్ర గవర్నర్​ ఆర్​ఎన్​ రవి సోమవారం అన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాలకు తమిళ భాష విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే అంతర్జాతీయ భాషఇంగ్లిషును బోధిస్తున్నప్పుడు హిందీని ఎందుకు నేర్చుకోవాలని తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి ప్రశ్నించారు. కాగా, ఇవ్వాల కోయంబత్తూరులోని భారతియార్ యూనివర్సిటీ విద్యార్థులనుద్దేశించి గవర్నర్​ ప్రసంగిస్తూ ఈ విషయాన్ని లేవనెత్తారు.

మద్రాసు ప్రెసిడెన్సీలోని బ్రిటిష్ పాలనపై గవర్నరు విమర్శలు గుప్పించారు. మద్రాసు ప్రెసిడెన్సీలోని వ్యవసాయం, ఇనుము పరిశ్రమ, విద్యావ్యవస్థను బ్రిటిష్ వారు క్రమపద్ధతిలో నాశనం చేశారని పేర్కొన్నారు.  మన ప్రధాని ఎప్పుడూ చెబుతున్నట్లుగా తమిళం ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన భాష. ఇది చాలా గొప్పది. మేధో మరియు ఆధ్యాత్మికమైనది. అది చేరని ప్రాంతాల్లో తమిళుల వ్యాప్తిని కొనసాగించాలి. సీఎం, సీజేల సమావేశంలో హైకోర్టులో రాష్ట్ర భాష ఆవశ్యకతను కూడా ప్రధాని నొక్కి చెప్పారు. అని గవర్నర్​ గుర్తు చేశారు.

బనారస్ యూనివర్శిటీలో సుబ్రమణ్య భారతి పీఠం ఏర్పాటుపై దృష్టి సారించిన గవర్నర్ రవి, తమిళం దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాలని అన్నారు. విద్యా మంత్రిత్వ శాఖ ఇతర రాష్ట్రాల విద్యార్థులను కూడా తమిళం నేర్చుకునేలా ప్రోత్సహిస్తోంది. తమిళనాడు వెలుపల ఉన్న యూనివర్సిటీల్లో తమిళులకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని సీఎంను కోరుతున్నా అన్నారు. తమిళం యొక్క ప్రయోజనం, గొప్పతనాన్ని ఇతరులు కూడా పొందాలని చెప్పుకొచ్చారు గవర్నర్ రవి.

తమిళనాడుకు గొప్ప పాత్ర ఉంది..

“మేము ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటున్నాము. ఇది 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకోవడానికి భారత ప్రభుత్వం చేపట్టిన చొరవ. ప్రగతిశీల రాష్ట్రంగా ఉన్న తమిళనాడుకు గొప్ప పాత్ర ఉంది’’ అని గవర్నర్‌ అన్నారు. టెక్నాలజీలో భారతదేశం చాలా ముందుందని, మానవ ప్రయత్నాలలో భారతదేశానికి అద్భుతమైన గతం ఉందని గవర్నర్ హైలైట్ చేశారు. బ్రిటిష్ వలసపాలన మన ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని ఆయన పేర్కొన్నారు. మన చోళులు సముద్రయానానికి ప్రసిద్ధి చెందారు. ఈస్టిండియా కంపెనీ మద్రాసుకు వచ్చాక ఇక్కడి నుంచి తీసుకెళ్లిన తొలి సాంకేతికత నౌకా నిర్మాణమే అని గవర్నర్ ఆర్.ఎన్.రవి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement