Monday, April 15, 2024

Bihar: అందరూ అన్నిసార్లు మంత్రులు కాలేరు.. నితీశ్ కుమార్‌ ఆగ్రహం

కేబినెట్‌లో చోటు లభించలేదన్న అసంతృప్త ఎమ్మెల్యేల వ్యాఖ్యలకు బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఘాటుగా బదులిచ్చారు.లేషి సింగ్‌ మరోసారి మంత్రివర్గంలో చేరడంతో పాటు తనకు మొండిచేయి చూపడం పట్ల జేడీయూ సీనియర్‌ ఎమ్మెల్యే బిమా భారతి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రిపదవులు దక్కని వారిలో అసమ్మతి స్వరం పెరగిన నేపధ్యంలో నితీష్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరికీ ప్రతి సమయంలో మంత్రి పదవులు ఇవ్వలేమని నితీష్‌ అన్నారు.

బిమా భారతి గతంలో రెండు సార్లు మంత్రిగా పనిచేశారని గుర్తు చేస్తూ ఈ తరహా ప్రవర్తన సరైందికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఆమెతో సంప్రదింపులు జరుపుతుందని, ఆమె అర్ధం చేసుకుంటే మంచిదని..లేనిపక్షంలో ఆమెదారి ఆమె చూసుకోవచ్చన్నారు. లేషి సింగ్‌ మంత్రిగా కొనసాగితే తాను రాజీనామా చేస్తానని బిమా భారతి ఇప్పటికే పార్టీని హెచ్చరించారు. ప్రతిసారి లేషీ సింగ్‌ మంత్రివర్గంలో ఎలా తీసుకుంటున్నారు..ఆమె తన నియోజకవర్గంలో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నా అందలం ఎక్కిస్తున్నారని భారతి మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement