Thursday, March 28, 2024

బీసీ బిల్లు సాధనకు ఉత్తరాదిన సంఘాల మద్దతు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పార్లమెంట్ లో బీసీ బిల్లు సాధనకు ఉత్తరాది రాష్ట్రాల మద్దతును సేకరిస్తున్నామని, అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ పేర్కొన్నారు. ఈమేరకు న్యూఢిల్లీలోని కేజీ మార్గ్ లో బుధవారం బీసీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ అధ్యక్షతన నిర్వహించిన ఓబీసీ కీలక సమావేశంలో పలువురు విద్యార్థి సంఘాల నాయకులు, న్యాయవాదులు , కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఢిల్లీలోని స్థానిక ఓబీసీ నాయకులు హాజరయ్యారు. ఓబీసీల చిరకాల ఆకాంక్షలను నెరవేర్చే బీసీ బిల్లుకు తమ సంపూర్ణ మద్ధతు ఉంటుందని సంయుక్తంగా ప్రకటించారు.

ఉత్తరాదిన యూపీ , మధ్య ప్రదేశ్ , బీహార్ , రాజస్థాన్, హర్యానా, పంజాబ్ ,మహారాష్ట్ర , ఢిల్లీ రాష్ట్రాలలో ఓబీసీ ఉద్యమాన్ని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నామని జె.ఎన్.యూ ఓబీసీ నాయకుడు ములాయం సింగ్ అన్నారు. బీసీలకు విద్య ఉద్యోగ వాణిజ్య పారిశ్రామిక రాజకీయ రంగాలలో వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అందేలా బీసీ బిల్లు డ్రాఫ్ట్ ను తయారుచేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. బీసీ మేధావులు, న్యాయవాదులు , జర్నలిస్టులు , కవులు , కళాకారులు ,ఉద్యమ కారులు , రాజకీయనాయకులు , విద్యార్థి నాయకులు , శ్రామిక వర్గాలతో పలు అంతర్గత చర్చలు నిర్వహించడంతో బాటు అన్ని రాష్ట్రాలలో క్షేత్ర స్థాయి పర్యటనలను త్వరలో నిర్వహించనున్నామని దాసు సురేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో జె.ఎన్.యూ ఓబీసీ నాయకుడు ములాయం సింగ్(ఉత్తరప్రదేశ్), అలహాబాద్ హై కోర్ట్ అడ్వకేట్ అనురాగ్ కిషన్(మధ్యప్రదేశ్), సీనియర్ జర్నలిస్ట్ స్వామి పాటిల్(మహారాష్ట్ర), కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కుప్పు స్వామి, ప్రకాశ్ వర్మ, శ్రవణ్ కుమార్ ,రజత్ వర్మ తదితరులు ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement