Friday, April 19, 2024

నోకియాకు లాభాల పంట

మొబైల్ వచ్చిన కొత్తలో నోకియా ఫోన్ బ్రాండ్ ఎంత పాపులార్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాఫ్ట్ వేర్‌లో వచ్చిన మార్పులు, నోకియా ప్రపంచానికి తగిన విధంగా పోటీ పడలేకపోవడంతో సంస్థ కనుమరుగైంది. కానీ ఈ సంస్థ నుంచి వచ్చే ఉత్పత్తులు అంటే వినియోగదారులకు ఒక నమ్మకం. మన దేశంలో మరే ఇతర బ్రాండ్ కూడా ఆ రేంజ్‌లో పాపులర్ కాలేదు. అయితే ఈ సంస్థ ఇప్పుడు 5జీ ఉత్పత్తులను తయారు చేస్తోంది.

5జీ పరికరాల అమ్మకాల వృద్ధిలో తాము దూసుకుపోతున్నామని సంస్థ స్వయంగా ప్రకటన చేసింది. లాభాలు పెరగడమే కాకుండా 14 శాతం తమ వాటాలు వృద్ది సాధించాయని సంస్థ పేర్కొంది. 5 జి నెట్‌వర్క్‌లకు సంబంధించి పరికరాల తయారి మొదలుపెట్టడంతో నోకియాతో పాటుగా స్వీడన్ కంపెనీ ఎరిక్సన్ ఇప్పుడు లాభాలు ఎక్కువ అర్జిస్తున్నాయి. వీటితో పాటుగా పోటీలో ఉన్న చైనా సంస్థ హువావే మాత్రం ప్రభుత్వాల నుంచి ప్రైవసీ సమస్యలను ఎదుర్కొంటుంది. ఈ సంవత్సరం 5జీలో భారీ డిమాండ్ చూశామని, ప్రాథమికంగా గృహాలు, కార్యాలయాలకు ఫైబర్ కనెక్షన్లు ఎక్కువగా కోరుకుంటున్నారు అని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పెక్కా లండ్‌మార్క్ ఒక ఇంటర్వ్యూలో వివరించారు. త్రైమాసిక ఆదాయం 3 శాతం పెరిగి సుమారు రూ. 45,600 కోట్లకు చేరుకుందని ఆయన వివరించారు. నోకియా నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారంలో అమ్మకాలు 28 శాతం పెరిగి సుమారు రూ. 15,530 కోట్లకు చేరుకున్నాయని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement