Monday, March 25, 2024

మానవత్వాన్ని చాటిన నిర్మలా, ఎన్‌ఎస్‌డిఎల్ ఎండీకి ప‌రుగెత్తి మ‌రీ నీళ్లిచ్చింది

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్‌ ఉన్న ఫళంగా తన సీట్లోంచి దాహంతో నాలుక పిడచకట్టుకుపోతున్న ఒక సంస్థ ఎండికి మంచినీళ్లు అందించడం చర్చనీయాంశమైంది. నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజటరీ లిమిటెడ్‌(ఎన్‌ఎస్‌డిఎల్‌) సిల్వర్‌ జూబ్లి వేడుకలు ముంబాయిలో జరిగాయి. ఈ వేడుకకు నిర్మలా సీతారామన్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఎన్‌ఎస్‌ డిఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పద్మజ చుండూరీ మాట్లాడుతున్న సమయం లో మీడియా అక్కడే ఉంది.

ఆమెకు దాహం వేయడంతో మంచినీళ్లు అందించాల్సిందిగా సైగ చేసింది. అయినప్పటికీ వేళకు మంచినీళ్లు ఇవ్వకపోవడంతో కేంద్ర ఆర్థిక మంత్రి తన సీట్లోంచి లేచి వాటర్‌ బాటిల్‌ తీసుకొచ్చి పద్మజకు అంద జేసింది. నిర్మలా సీతారామన్‌ మానవత్వానికి ఇచ్చిన గౌరవం చూసి అక్కడున్న వాళ్లంతా ముగ్దులయ్యారు. సాక్షాత్తు నిర్మలా సీతారామన్‌ తన కోసం వాటర్‌ బాటిల్‌ పట్టుకురావడం పట్ల పద్మజ ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. ఈ దృశ్యం వెంటనే నెట్టింట్లో వైరల్‌ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement