Thursday, April 25, 2024

పోసానిపై మెగా కుమార్తె నిహారిక ఫైర్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై అసభ్యపదజాలంతో మాట్లాడిన పోసాని కృష్ణమురళిపై మెగా డాటర్ నిహారిక ఆగ్రహం వ్యక్తం చేసింది. రిపబ్లిక్ సినిమా ఫంక్షన్‌లో ఆడవాళ్లపై పవన్ ఒక్కమాట కూడా మాట్లాడలేదని నిహారిక వ్యాఖ్యానించింది. ఏపీ సీఎం జగన్‌పై ఆరోపణలు చేసినందుకే పోసాని ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నాడని మండిపడింది.

పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న పోసానిని మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలని నిహారిక డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి పోసానిపై చర్యలు తీసుకోవాలని నిహారిక కోరింది. కాగా మంగళవారం నాడు ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో పవన్‌పై పోసాని తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు అసభ్యపదజాలంతో దూషణలు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement