Thursday, April 25, 2024

రేపటితో ముగియనున్న నైట్ కర్ఫ్యూ..నెక్స్ట్ ఏంటీ..?

తెలంగాణ‌లో కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన హైకోర్టు..రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితుల‌పై రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసింది. రేపటితో రాత్రిపూట కర్ఫ్యూ ముగుస్తుందని, అనంత‌రం తీసుకోబోతున్న‌ చర్యలేంటని కోర్టు ప్రశ్నించింది. పరిస్థితిని సమీక్షించి రేపు నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం సమాధానమివ్వ‌డంతో దీనిపై కోర్టు మండిప‌డింది. చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం ఏంట‌ని నిల‌దీసింది. క‌ర్ఫ్యూ వంటి విష‌యాల‌ను కనీసం ఒకరోజు ముందు చెబితే వ‌చ్చే నష్టమేంటని ప్ర‌శ్నించింది. దీంతో ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి మధ్యాహ్నంలోగా వివ‌రాలు చెబుతామ‌ని ఏజీ కోర్టుకు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement