Thursday, April 25, 2024

అక్కడ 24 గంటల కర్ఫ్యూ..

కొవిడ్‌ కేసుల పెరుగుదల నేపథ్యంలో మణిపూర్‌లోని ఏడు జిల్లాల పరిధిలో ప్రభుత్వం 24 గంటల కర్ఫ్యూ విధించింది. శనివారం నుంచి 17వ తేదీ వరకు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. మణిపూర్‌లో 600 కరోనా కేసులు రికార్డయ్యాయి. మణిపూర్‌లో ఇప్పటి వరకు 34,333 కొవిడ్‌ కేసులు రికార్డవగా.. 30,378 మంది కోలుకున్నారు. మరో 3,506 యాక్టివ్‌ కేసులున్నాయని, ఇప్పటి వరకు వైరస్‌ బారినపడి 449 మంది మరణాలు నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వం ఏప్రిల్‌ 29న గ్రేటర్‌ ఇంఫాల్‌ ప్రాంతాన్ని కంటైనేషన్‌ జోన్‌గా ప్రకటించింది. ఇందులో ఇంఫాల్‌ ఈస్ట్‌, వెస్ట్‌ జిల్లాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement