Saturday, April 20, 2024

రుయా మరణాలపై నివేదిక ఇవ్వాలని NHRC ఆదేశం

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక భారీ సంఖ్యలో కరోనా రోగులు మృతి చెందిన ఘటనపై తీవ్ర కలకలం రేగిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం మాత్రం 11 మంది మృతి చెందారని ప్రకటన చేయగా.. ప్రతిపక్షాలు మాత్రం 20 మందికి పైగా చనిపోయారని ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ సహా మరో వ్యక్తి జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను స్వీకరించిన ఎన్‌హెచ్ఆర్సీ రుయా ఘటనపై నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement