Friday, March 29, 2024

నిజామాబాద్ జిల్లాలో నవదంపతుల ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్‌ జిల్లాలో విషాద ఘటన జరిగింది. వివాహం జరిగి 10 రోజులు గడవకముందే పురుగుల మందు తాగి నవ దంపతులు బలవన్మరణానికి యత్నించారు. వేల్పూరు మండలం పచ్చల నడుకుడలో ఈ ఘటన చోటు చేసుకుంది. విభేదాల కారణంగానే భార్యాభర్తలు ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నెల 13న యువతి, యువకుడికి వివాహం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరిని కుటుంబీకులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దంపతుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement