Wednesday, April 24, 2024

ఏపీలో కొత్తగా 5674 కరోనా కేసులు…45 మంది మృతి

ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుతూ వస్తుంది. తాజాగా గడిచిన 24గంట‌ల్లో మొత్తం 1,03,935మందికి కరోనా ప‌రీక్ష‌లు చేయ‌గా 5674మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే మరో 45మంది కరోనా కారణంగా మృతి చెందారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో 8,014మంది క‌రోనా నుంచి కొలుకున్నారు. అలాగే ప్ర‌స్తుతం 65,244యాక్టివ్ కేసులు రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 12,269కి చేరింది.

తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 18,44,917 కి చేరింది. అలాగే అందులో 17,67,404మంది క‌రోనా నుంచి కొలుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement