Friday, April 26, 2024

ఏపీలో కొత్తగా 4684 కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 80,712 సాంపిల్స్ ని పరీక్షించగా 4,684 మంది కోవిడ్ 19 పాజిటివ్ గానిర్ధారింపబడ్డారు. అలాగే కోవిడ్ వల్ల చిత్తూర్ లో ఎనిమిది, తూర్పు గోదావరి లో ఐదుగురు, కృష్ణ లో ఐదుగురు,అనంతపూర్ లో ముగ్గురు, నెల్లూరు లో ముగ్గురు, శ్రీకాకుళం లో ముగ్గురు, కర్నూల్ లో ఇద్దరు, ప్రకాశం లో ఇద్దరు, విశాఖపట్నం లో ఇద్దరు, గుంటూరు లో ఒక్కరు, వైఎస్ఆర్ కడప లో ఒక్కరు మరియు పశ్చిమ గోదావరి లో ఒక్కరు మరణించారు.

గడచిన 24 గంటల్లో 7,324 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటి వరకు రాష్ట్రంలో 2,13,61,014 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.

మొత్తం కరోనా కేసుల సంఖ్య ….1862036
యాక్టీవ్ కేసుల సంఖ్య…..51204
కోలుకున్న వారి సంఖ్య….1798380
మొత్తం మరణాల సంఖ్య….12452

Advertisement

తాజా వార్తలు

Advertisement