Thursday, April 25, 2024

ఇండియా లో కొత్తగా 46,418 కరోనా కేసులు

ఇండియా లో కరోనా కేసులు అదే స్థాయిలో నమోదు అవుతున్నాయి. తాజాగా గ‌డిచిన 24గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 46,418కొత్త కరోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. అలాగే గడిచిన 24 గంటల్లో 58,578మంది క‌రోనా నుంచి కొలుకున్నారు. అలాగే 979మంది నిన్న ఒక్కరోజే మరణించారు.

ఇక తాజా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 5,72,994కి చేరింది. అలాగే మొత్తం డిశ్చార్జ్ ల సంఖ్య 2,93,09,607కు చేరింది. మొత్తం కేసుల సంఖ్య 3,02,79,331కు పెరిగింది. మరోవైపు దేశ‌వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,96,730 మంది మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement