Thursday, April 25, 2024

ఏపీలో కొత్తగా 2672 కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసుల సంఖ్య గడిచిన రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మొత్తం 91,594 మందికి కరోనా పరీక్షలు చేయగా…2672 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే 18 మంది కరోనాతో మృతిచెందారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో 2,467 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఇక తాజా గణాంకాల ప్రకారం మొత్తం కేసుల సంఖ్య 19,37,122కు పెరగగా.. రికవరీ కేసుల సంఖ్య 18,98,966కు చేరింది. అలాగే కరోనాతో ఇప్పటి వరకు 13,115 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25,041 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement