Friday, April 19, 2024

ఐసీసీ వన్డే ర్యాంకుల్లో న్యూజిలాండ్ నంబర్‌వన్

ఐసీసీ తాజాగా టీమ్ ర్యాంకులను ప్రకటించింది. వన్డేల్లో 121 రేటింగ్ పాయింట్లతో న్యూజిలాండ్ అగ్రస్థానానికి చేరుకుంది. టీమిండియా ఒక ర్యాంకు కోల్పోయి 115 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా 118 పాయింట్లతో రెండో ర్యాంకులో ఉంది. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా 4, 5 స్థానాలు దక్కించుకున్నాయి. ఇక టీ20ల విషయానికి వస్తే ఇంగ్లండ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఆ తర్వాతి ర్యాంకులను కైవసం చేసుకున్నాయి.

అటు ఆటగాళ్ల ర్యాంకుల్లో వన్డేల్లో బాబర్ ఆజమ్ 865 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 857 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ 825 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. టీ-20ల్లో డేవిడ్ మలాన్ (ఇంగ్లండ్), అరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా), బాబర్ ఆజమ్ (పాకిస్థాన్), కాన్వే (న్యూజిలాండ్), విరాట్ కోహ్లీ టాప్-5 జాబితాలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement