Thursday, April 18, 2024

జూన్ 1 నుంచి కొత్త రూల్స్‌.. అమల్లోకి పెరిగిన వడ్డీ రేట్లు

జూన్‌ 1 నుంచి కొన్ని మార్పులు, కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి. ఇవి మీ ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపనున్నాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండియా పోస్ట్ పేమెంట్స్‌ బ్యాంక్‌ కస్టమర్లు కాకుండా.. వివిధ వర్గాల వాహనాలకు థర్‌ పార్టీ మోటార్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం కూడా పెరగడంతో వాహన యజమానుల నెలవారీ బడ్జెట్‌పై నేరుగా ప్రభావం చూపుతుంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తమ హోమ్‌లోన్‌ ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ లెండింగ్‌ రేటును 40 బేసిస్‌ పాయింట్లు పెంచి 7.05 శాతానికి చేర్చింది. గతంలో ఈబీఎల్‌ఆర్‌ రేటు 6.65 శాతంగా ఉంది. ఇల్లు, వాహన రుణాలతో సహా ఏ రకమైన లోన్‌ను అందిస్తున్నప్పుడు బ్యాంకులు ఈబీఎల్‌ఆర్‌పై క్రెడిట్‌ రిస్క్‌ ప్రీమియంని జోడిస్తాయి. ఎస్‌బీఐ వెబ్‌సైట్‌ ప్రకారం.. పెరిగిన వడ్డీ రేట్లు జూన్‌ 1, 2022 నుంచి (నేడు) అమల్లోకి వస్తున్నాయి. అన్ని ఫ్లోటింగ్‌ రేట్‌ హోమ్‌లోన్‌లకు వడ్డీ రేట్లు ఈబీఎల్‌ఆర్‌కు లింక్‌ చేయబడ్తాయి.

నెలవారీ బ్యాలెన్స్‌ రూ.25వేలు..

యాక్సిస్‌ బ్యాంక్‌ జీతం, సేవింగ్స్‌ ఖాతాదారులకు సర్వీస్‌ ఛార్జీలను కూడా పెంచింది. సగటు నెలవారీ బ్యాలెన్స్‌ రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచింది. అయితే బ్యాలెన్స్‌ నిర్వహించనప్పుడు ఎలాంటి కనీస సేవా రుసుము ఉండదు.

టూ వీలర్‌కు ఇన్సూరెన్స్‌ దెబ్బ..

కేంద్ర రోడ్డు రవాణ, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించిన విధంగా వివిధ వర్గాల వాహనాలకు థర్‌ ్డ పార్టీ మోటార్‌ బీమా ప్రీమియం పెరుగుతుంది. 75 సీసీ కంటే తక్కువ ఇంజిన్‌ కెపాసిటీ ఉన్న ద్విచక్ర వాహనాలను కలిగి ఉన్నవారు థర్డ్‌ పార్టీ కవర్‌ ధర రూ.538 కు చేరుకుంది. 75 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్‌ కెపాసిటీ ఉండే టూవీలర్స్‌ అయితే.. 150సీసీకి మించని ద్విచక్ర వాహనాలకు ప్రీమియం ధర రూ.714గా ఉంటుంది. ఇంజిన్‌ కెపాసిటీ 150 సీసీ దాటినా.. 350 సీసీకి మించని ద్విచక్ర వాహనాలకు ప్రీమియం ధర రూ.1366 చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇక 350 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్‌ సామర్థ్యం ఉంటే.. ప్రీమియం ధర రూ.2,804గా ఉంటుంది.

- Advertisement -

ఫోర్‌ వీలర్‌ వాహనాలకూ..

ప్రైవేట్‌ ఫోర్‌ వీలర్‌ థర్డ్‌ పార్టీ రేట్లు కూడా పెరిగాయి. జూన్‌ 1 నుంచి 1000 సీసీ కంటే తక్కువ ఇంజిన్‌ సామర్థ్యం ఉన్న కారుకు థర్డ్‌ పార్టీ ప్రీమియం రూ.2,094గా ఉంటుంది. 1000 సీసీ నుంచి 1500 సీసీ లోపు ఉంటే.. రూ.3,416గా నిర్ణయించబడింది. 1500 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన కార్ల కోసం ప్రీమియం రూ.7,897గా ఉంటుంది. ఈ రేట్లు చివరిసారిగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో సవరించబడ్డాయి. కరోనా కారణంగా ఎలాంటి మార్పులు చేయలేదు.

ఐపీపీబీ సర్వీస్‌ ఛార్జీ..

ఇండియా పోస్ట్ పేమెంట్స్‌ (ఐపీపీబీ) ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టమ్‌ సర్వీస్‌ ఛార్జీలను (ఏఈపీఎస్‌) ప్రవేశపెట్టింది. అంటే ఏఈపీఎస్‌ జారీ చేసేవారి లావాదేవీ ఛార్జీలు జూన్‌ 15, 2022 నుంచి అమల్లోకి వస్తాయి. అయితే నగదు ఉప సంహరణ, నగదు డిపాజిట్‌, మినీ స్టేట్మెంట్‌ వంటి ప్రతీ నెలా మొదటి మూడు ఏఈపీఎస్‌ జారీ చేసే లావాదేవీలు ఉచితంగా ఉంటాయి. మీరు ఉచిత లావాదేవీల పరిమితిని దాటితే.. ఏఈపీఎస్‌ జారీచేసేవారి నగదు ఉపసంహరణలు, నగదు డిపాజిట్‌లకు ప్రతీ లావాదేవీకి రూ.20తో పాటు జీఎస్‌టీ విధించబడుతుంది. మినీ స్టేట్మెంట్‌ లావాదేవీలకు ప్రతీ లావాదేవీకి రూ.5తో పాటు జీఎస్‌టీ విధించబడుతుంది.

హాల్‌మార్క్‌ తప్పనిసరి..

జూన్‌ 1వ తేదీ నుంచి గోల్డ్‌ హాల్‌ మార్కింగ్‌ తప్పనిసరి. 14 క్యారెట్లు, 18 క్యారెట్లు, 20 క్యారెట్లు, 22 క్యారెట్లు, 23 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారంపై హాల్‌ మార్కింగ్‌ ఉంటోంది. 21 క్యారెట్లు లేదా 19 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఇప్పటి వరకు హాల్‌ మార్కింగ్‌ లేదు. అయితే జూన్‌ 1వ తేదీ నుంచి నిబంధనలు మారుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement