Wednesday, April 24, 2024

బ్లూ క‌ల‌ర్‌లో టీమిండియా కొత్త జెర్సీ.. విడుదల చేసిన బీసీసీఐ

టీమిండియా కొత్త జెర్సీని బీసీసీఐ విడుదల చేసింది. ఈసారి లేతనీలం రంగులో ఉన్న జెర్సీనే బీసీసీఐ సెలెక్ట్ చేసింది. ఈ జెర్సీ 2007 టీ20 ప్రపంచకప్‌లో భారత జెర్సీతో పోలి ఉండటంతో అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. కొన్ని రోజులుగా త్వరలోనే కొత్త జెర్సీ విడుదల చేస్తామని బీసీసీఐ, భారత జెర్సీ స్పాన్సర్ ఎంపీఎల్ స్పోర్ట్స్ ఊరిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఆదివారం ఈ జెర్సీని బీసీసీఐ ఆవిష్కరించింది.

‘క్రికెట్ అభిమానుంలదరి కోసం.. టీమిండియా కొత్త టీ20 జెర్సీ’ అంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో వీటిని విడుదల చేశారు. మంగళవారం నుంచి మొదలయ్యే భారత్, ఆస్ట్రేలియా సిరీస్ నుంచి టీమిండియా ఆటగాళ్లు వీటినే ధరించనున్నారు. ఇప్పటికే ఈ జెర్సీ సేల్స్‌ను ఎంపీఎల్ ప్రారంభించేసింది కూడా. ఈ కొత్త జెర్సీని చూసిన అభిమానులు అద్భుతంగా ఉందని కొనియాడుతున్నారు. భారత్ కూడా ఇలాగే అద్భుతంగా ఆడాలని కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement