Friday, March 29, 2024

అన‌సూయ‌ని ట్రోలింగ్స్ చేస్తోన్న నెటిజ‌న్స్ – పోలీస్ కేసు పెడ‌తాన‌న్న న‌టి

సెల‌బ్రిటీలు అన్నాక ట్రోలింగ్స్..కామెంట్స్.రూమ‌ర్స్ కామ‌నే..అయితే ఆ ట్రోలింగ్స్ మ‌రీ శృతి మించితే ఎవ‌రికైనా బాధ‌గా ఉంటుంది. అదే జ‌రిగింది న‌టి..యాంక‌ర్ అన‌సూయ విష‌యంలో.. తనను కానీ, తన కుటుంబాన్ని కానీ అవమానించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పింది అన‌సూయ‌.ఇకపై తనను వేధిస్తూ చేసే ప్రతి ట్వీట్ కు రీట్వీట్ చేస్తానని… ఇలా ఎందుకు చేస్తానో తెలుసుకోవాలని అనసూయ అన్నారు. తనను వేధించడం కోసం డబ్బులు చెల్లించి, ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ఎన్నో ఏళ్ల నుంచి ట్వీట్స్ చేయిస్తున్నారన్నారు. తన ట్విట్టర్ ఖాతాను క్లీన్ చేసి విసుగొస్తోందని అన్నారు. మీరు ఎన్ని అంటున్నా తాను దయతో వ్యవహరిస్తున్నానని… అందుకే మీరు ఇలా చేస్తున్నారని చెప్పారు. తనను ఆంటీ అని పిలుస్తూ అవమానించేలా పోస్టులు పెడుతున్నారని… ఇకపై ఇలాంటి పోస్టులు పెడితే స్కీన్ షాట్లను తీసి, పోలీసు కేసు పెడతానని అన్నారు. తనను అనవసరంగా ఇబ్బంది పెట్టినందుకు మీరు బాధపడే స్థాయికి తీసుకెళ్తానని చెప్పారు. ఇదే తన చివరి వార్నింగ్ అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement