Wednesday, April 24, 2024

మెగాస్టార్ కు పాలాభిషేకం… ఏంటి ఒక్క ట్వీట్ కే !!

మెగాస్టార్ చిరంజీవికి విశాఖపట్నంలో పాలాభిషేకం చేశారు. విశాఖ ఉక్కు కార్మికులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నవేళ చిరంజీవి మద్దతు ప్రకటించడం పట్ల వారు ఈ పాలాభిషేకం చేశారు. విశాఖ ఉక్కును కాపాడుకుందామని… తాను విద్యార్థిగా ఉన్న సమయంలో విశాఖ ఉక్కు పరిశ్రమ సాధన కోసం జరిగిన పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ ట్విట్టర్ వేదికగా మద్దతును ప్రకటించారు.

కాగా మెగాస్టార్ చిరంజీవి కి కృతజ్ఞతలు తెలుపుతూ చిత్రపటానికి ఈ రోజు పాలాభిషేకం చేశారు. మొన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మద్దతు ప్రకటించడం పట్ల కృతజ్ఞతగా కేటీఆర్ కు పాలాభిషేకం చేసిన సంగతి తెలిసిందే. అయితే మెగాస్టార్ కు పాలాభిషేకం చేయడం పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఏదో మద్దతు అంటూ ఒక్క ట్వీట్ కే పాలాభిషేకం చేస్తారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement