Wednesday, April 24, 2024

నేటి త‌రం మ‌హాన‌టి స‌మంత‌.. స్ప‌ష్టం చేసిన సురేశ్ బాబు..అల్లు అర‌వింద్

హీరో బాల‌కృష్ణ హోస్ట్ చేస్తున్న షో అన్ స్టాప‌బుల్.ఈ షోకి గెస్ట్ లుగా విచ్చేశారు..స్టార్ ప్రొడ్యూస‌ర్స్..డైరెక్ట‌ర్లు కోదండరామిరెడ్డి, కే రాఘవేంద్రరావు, నిర్మాతలు దగ్గుబాటి సురేశ్‌బాబు, అల్లు అరవింద్‌..వీరితో త్వరలో కొత్త ఎపిసోడ్‌ రాబోతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రోమోను కూడా ఆహ టీం ఇప్పటికే విడుదల చేసింది. అయితే ఈ షోలో భాగంగా సురేశ్‌బాబు, అల్లు అరవింద్‌కు బాలకృష్ణ పలు ప్రశ్నలు వేశారు. ‘ఈ జనరేషన్‌ హీరోయిన్లలో మహానటి స్థాయికి వెళ్లగలిగే తార ఎవరని మీరు అనుకుంటున్నారు.. అని అడగ్గా.. ‘సమంత’ అని ఇద్దరూ సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో అవ్వగలిగితే ఆ అమ్మాయి సమంత ఒక్కటే ఆ స్థాయికి వెళ్లగలదు’ అంటూ సురేశ్‌బాబు చెప్పారు. సురేశ్‌బాబు కామెంట్‌పై తాజాగా సమంత స్పందించింది. వీడియో క్లిప్‌ను రీట్వీట్‌ చేస్తూ.. లవ్‌ సింబల్‌ను జత చేసింది.

v

Advertisement

తాజా వార్తలు

Advertisement