Saturday, April 20, 2024

నీట్ పరీక్షలు వాయిదా

కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చిన కారణంగా నీట్ పీజీ పరీక్షలను మరో నాలుగు నెలలపాటు వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 18న ఈ పరీక్షలను నిర్వహించాల్సి ఉండగా యువ వైద్య విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. మెడికల్ కాలేజీల్లో ఆడ్మిషన్ల కోసం నీట్ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఆయా కాలేజీల్లో అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు. కాగా 100 రోజులు కోవిడ్ విధుల్లో ఉన్న పీజీ విద్యార్థులకు ప్రభుత్వ వైద్య నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement