Saturday, April 20, 2024

స్పెయిన్ లో రెండు వారాలు ఎంజాయ్ చేయ‌నున్న న‌య‌న‌తార‌..విఘ్నేశ్ శివ‌న్

ప్ర‌త్యేక విమానంలో స్పెయిన్ వెళ్లారు స్టార్ క‌పుల్స్ నయనతార .. విఘ్నేష్ శివన్ లు. హనీమూన్ ప్లాన్ చేసిన కొత్త జంట దాదాపు రెండు వారాల పాటు స్పెయిన్ లో ఉంటారని సమాచారం.వీరిద్ద‌రు కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. హనీమూన్ కి వెళ్తున్నట్లుగా విఘ్నేష్ శివన్ పోస్ట్ ను చూస్తుంటే అర్థం అవుతోంది. తమిళంతో పాటు తెలుగు లో కూడా వరుసగా సినిమాల్లో నటిస్తున్న నయనతార పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో వరుసగా నటించేందుకు డేట్లు ఇచ్చినట్లుగా సమాచారం .హీరోయిన్ గా నయనతార సౌత్ లోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా పేరు ను దక్కించుకుంది. ఇక విఘ్నేష్ శివన్ తో కలిసి బ్యానర్ ను ఏర్పాటు చేసి సినిమాల నిర్మాణం కూడా చేస్తున్న విషయం తెల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement