Thursday, April 25, 2024

ముంబై ఎయిర్ పోర్టులో క‌వ‌ల‌పిల్ల‌ల‌తో న‌య‌న్.. విఘ్నేశ్

ముంబై ఎయిర్ పోర్టులో సంద‌డి చేశారు స్టార్ క‌పుల్స్ న‌య‌న‌తార‌..విఘ్నేశ్ శివ‌న్ లు. పెళ్ళి జరిగిన కొన్ని నెలలకే సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిగా మారి, అందరికి షాక్ ఇచ్చింది బ్యూటీ. ప్రస్తుతం సినిమాలు చేసుకుంటూ.. ఇద్దరు పిల్లలకి తల్లిగా ఓ వైపు ఫ్యామిలీ లైఫ్ ని ఆస్వాదిస్తూ.. బిజీగా ఉంది నయన్. రీసెంట్ గా కనెక్ట్ అనే హారర్, థ్రిల్లర్ సినిమాతో ఆడియన్స్ ను మెప్పించింది బ్యూటీ. అయితే నయనతార -విఘ్నేష్ శివన్ లు ఎవరికి వారు బయటకి కనిపిస్తున్నారు కాని.. వారి పిల్లలు మాత్రం ఇప్పటి వరకూ బయట కనిపించలేదు. వారిని కెమెరా కళ్లకు చిక్కకుండా పెంచుతున్నారు స్టార్ జంట. తాజాగా నయన్, విగ్నేష్ దంపతులు తమ కవల పిల్లలతో ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. దీంతో మీడియా వాళ్ళ కెమెరాలకు పనిచెప్పారు. స్టార్ కపుల్ వెంట పడ్డారు. ఇద్దరూ చెరో బాబుని ఎత్తుకొని కారులోంచి దిగి హడావిడిగా ఎయిర్ పోర్ట్ లోకి వెళ్ళిపోయారు. పిల్లలతో నయనతార, విఘ్నేష్ కనిపించారు కాని.. వారి పిల్ల‌ల‌ ఫేస్ లు మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు జంట.

Advertisement

తాజా వార్తలు

Advertisement