Thursday, April 25, 2024

నౌకాదళం అమ్ములపొదిలోకి వాగిర్‌ సబ్‌మెరైన్‌

భారత నౌకాదళం అమ్ములపొదిలోకి కల్వరి విభాగం జలాంతర్గామి వాగిర్‌ సబ్‌మెరైన్‌ చేరింది. మంగళవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ సబ్‌మెరైన్‌ను నేవీ అధికారులకు అప్పగించారు. కేవలం 24 నెలల వ్యవధిలో మూడవ జలాంతర్గామిని భారత నౌకాదళానికి అందించారు.

ఈ జలాంతర్గామి రాకతో ఇండియన్‌ నేవీ బలం పెరగనున్నదని నేవీ అధికారులు తెలిపారు. వాగిర్‌ 2022 ఫిబ్రవరి నుంచి సముద్ర ట్రయల్స్‌ ప్రారంభించింది. ఇతర జలాంతర్గాములతో పోలిస్తే అతి తక్కువ సమయంలో ఆయుధాలు, సెన్సార్ల ప్రధాన ట్రయల్స్‌ను పూర్తి చేసుకోవడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement