Friday, March 29, 2024

యాదాద్రిలో ఘనంగా నరసింహుడి జయంతి ఉత్సవాలు

తెలంగాణలో శరవేగంగా కొత్త రూపుదిద్దుకుంటున్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండోరోజైన సోమవారం నాడు యాదాద్రి క్షేత్రంలో పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. నిత్యారాధనల్లో అభిషేకం నిర్వహించి, ఉత్సవ కైంకర్యాలను చేపట్టారు. నవకలశ ఆరాధన, సహస్రనామ పఠనం జరిపారు. శ్రీలక్ష్మీ నరసింహస్వామి కాళీయమర్దనుడిగా దర్శనమిచ్చారు. రాత్రివేళ హనుమంత వాహనంపై శ్రీరాముడి అలంకరణలో అధిష్ఠింపజేసి సేవోత్సవం నిర్వహించారు. అనుబంధ ఆలయం పాతగుట్టలోనూ శ్రీస్వామి జయంతి వేడుకలను నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement