Thursday, April 18, 2024

ఫ్యాన్‌కు ఓటేసిన వారు.. ఇప్పుడు ఫ్యాన్‌కు ఉరేసుకుంటున్నారు: లోకేష్

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ నేత నారా లోకేష్ మరోసారి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఏపీలో ఉద్యోగాలు రాక చాలామంది యువ‌కులు ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆరోపించారు. వైఎస్ జ‌గ‌న్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యల ప్రదేశ్‌గా మారిపోయిందన్నారు. ఫ్యాన్‌కు ఓటేస్తే 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ యువత ఇప్పుడు అదే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటోందని లోకేష్ వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామానికి చెందిన యువకుడు వీరాంజనేయులు ప్రభుత్వ ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలచివేసిందన్నారు

ట్రిపుల్ ఐటీలో సీటు సాధించి సరస్వతీ పుత్రుడు అనిపించుకున్న యువకుడు జగన్ చేసిన మోసానికి బలైపోవడం బాధాకరమని లోకేష్ విమర్శించారు. బాధితుడు వీరాంజనేయులు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకో యువకుడు ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వం తక్షణమే ఫేక్ క్యాలెండర్ రద్దు చేసి 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలన్నారు. యువకులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని.. పోరాడి ఉద్యోగాలు సాధిద్దాం అంటూ లోకేష్ పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement