Monday, March 25, 2024

మూడు రాజ‌ధానుల బిల్లులు విత్ డ్రా ఓ నాట‌కం..నారా లోకేష్‌..

గుంటూరు తాడేప‌ల్లి మండ‌లం మ‌హానాడులో నారా లోకేష్ ప‌ర్య‌టించారు. ఇటీవ‌ల మృతి చెందిన టీడీపీ కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ సీఎం జ‌గ‌న్ కు ఏ స‌బ్జెక్ట్ పైనా అవ‌గాహ‌న లేద‌న్నారు. మూడు రాజ‌ధానులు అని ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెట్టార‌న్నారు. మాయ‌మాట‌ల‌తో అధికారంలోకి వ‌చ్చార‌ని మండిప‌డ్డారు. అసెంబ్లీ ప‌రిణామాల‌పై దృష్టి మ‌ర‌ల్చేందుకే మూడు రాజ‌ధానుల బిల్లును వెన‌క్కి తీసుకున్నార‌ని లోకేష్ తెలిపారు. మా త‌ల్లిని అవ‌మానించిన విధానం ప్ర‌జ‌లు తెలుసుకుంటున్నార‌నే మూడు రాజ‌ధానుల బిల్లు విత్ డ్రా చేశార‌ని అన్నారు. పోనీ విశాఖ‌,క‌ర్నూలు,అమ‌రావ‌తిని అభివృద్ధి చేశారా అంటే అదీ లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement