Wednesday, April 24, 2024

ఎలా ఉన్నావు రోజా ? బాలయ్య ఫోన్….!!

నగరి ఎమ్మెల్యే సినీ తార రోజా కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడారు నందమూరి బాలకృష్ణ. ఆమె ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు. అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రోజా చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మరో రెండువారాల పాటు రోజాకు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు పేర్కొన్నారు.

వాస్తవానికి ఇది వరకే ఆమెకు ఈ ఆపరేషన్లు నిర్వహించాల్సి ఉందని, కానీ గతేడాది కరోనా, ఈ జనవరిలో ఎన్నికల కారణంగా వాయిదాపడ్డాయి. ప్రస్తుతం రోజా ఆరోగ్యం కుదుటపడుతోంది. ఇక బుధవారం ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎమ్మెల్యే చెవిరెడ్డి, టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి తదితరులు రోజాను కలసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.ఇప్పుడు తాజా బాలకృష్ణ ఆమె ఆరోగ్యంపై ఫోన్ చేసి బాగోగులు కనుక్కున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో గతంలో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement