Thursday, April 25, 2024

ఆ కేసులో నందకుమార్‌కు బెయిల్‌ మంజూరు.. అయినా జైల్లోనే

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ఫిలింనగర్‌లోని డెక్కన్‌ కిచెన్‌ పేరుతో మోసం చేశాడనే కేసులో నందకుమార్‌కు బెయిల్‌ మంజూరైంది. పూచీకత్తుతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే బెయిల్‌ వచ్చినా నందకుమార్‌ బయటకు వచ్చే అవకాశం లేదు. బంజారాహిల్స్‌ పీఎస్‌లో నమోదైన మిగతా కేసుల్లోనూ బెయిల్‌ వస్తేనే ఆయన విడుదలయ్యే అవకాశం ఉంటుంది. బంజారాహిల్స్‌ పీఎస్‌లో నమోదైన ఓ కేసులో నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరుచేసింది. రూ.10 వేల పూచీకత్తుతో పాటు ఇద్దరు జామీను ఇవ్వాలని షరతు విధించింది.

ఫిలింనగర్‌లోని డెక్కన్‌ కిచెన్‌ పేరుతో రూ.70 లక్షలు మోసం చేశాడని, బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు నందకుమార్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నందకుమార్‌పై మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. నందకుమార్‌పై మొత్తం ఎన్ని కేసులు నమోదయ్యాయో వివరాలు ఇవ్వాలని కోర్టు బంజారాహిల్స్‌ పోలీసులను ఆదేశించింది. అన్ని కేసుల్లో బెయిల్‌ వస్తేనే నందకుమార్‌ జైలు నుండి విడుదలయ్యే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement