Friday, April 19, 2024

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నమిత దంపతులు..రాజకీయాలపై ఆసక్తి ఉందని చెప్పిన నటి

ఈ మధ్యకాలంలో రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు..కాగా నటి నమిత కూడా ఇదే విషయాన్ని తిరుమల వెంకటేశ్వరస్వామి సన్నిధిలో వెల్లడించడం గమనార్హం. తనకి రాజకీయాలపై ఆసక్తి ఉందని తెలిపింది.. నమిత దంపతులు ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఆలయ అధికారులు దంపతులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి లడ్డు ప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపల నమిత మీడియాతో మాట్లాడారు.చేయబోయే కొత్త సినిమాల గురించి మాట్లాడుతూనే రాజకీయాలపై ఆసక్తి ఉందని ఆమె పేర్కొన్నారు. తనకు రాజకీయాలపై ఆసక్తి ఉందని సాక్షాత్‌ ఏడుకొండల స్వామి చెంత ప్రకటించడం విశేషం. అందరూ క్షేమంగా ఉండాలని శ్రీ వేంకటేశ్వరస్వామిని కోరుకున్నానని తెలియజేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement