Tuesday, April 16, 2024

ఎమ్మెల్సీ ఎన్నికలు.. నాలుగో రౌండ్ పూర్తి

నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం నాలుగో రౌండ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. నాలుగో రౌండ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. నాలుగో రౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 17,100 ఓట్లతో తొలి స్థానంలో ఉండగా.. తీన్మార్ మల్లన్న 13,748 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. 11,917 ఓట్లతో కోదండరాం మూడో స్థానంలో ఉన్నారు. మూడు రౌండ్లు కలిపి పల్లాకు 16,281 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఓవరల్ గా ఇప్పటివరకు పల్లా రాజేశ్వర్ రెడ్డికి 63,444 ఓట్లు వచ్చాయి, తీన్మార్ మల్లన్నకు 48,004 ఓట్లు వచ్చాయి.

ఇక రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి వాణీదేవి, బీజేపీ అభ్య‌ర్థి రాంచంద‌ర్ రావు మధ్య పోటీ నెల‌కొంది. మూడో స్థానంలో స్వ‌తంత్ర అభ్య‌ర్థి ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ కొన‌సాగుతున్నారు. మూడో రౌండ్‌ పూర్తయ్యే సరికి సురభి వాణీ దేవికి  35,171 ఓట్లు రాగా, రాంచంద‌ర్‌ రావు‌కు 32,558 ఓట్లు వ‌చ్చాయి. ఆయ‌న త‌ర్వాతి స్థానాల్లో వ‌రుస‌గా నాగేశ్వర్, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి, టీడీపీ అభ్యర్థి రమణ కొన‌సాగుతున్నారు. ప్ర‌స్తుతం నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement