Friday, March 29, 2024

సోనూ కోసం సైకిల్ యాత్ర..

కరోనా కాలంలో ఎంతో మందికి సాయం చేసి రియల్ హీరో అయ్యాడు నటుడు సోనుసూద్. కరోనా సెకండ్ వేవ్ లోనూ ఆపదలోఉన్న వారికి సాయం అందించి ఆపద్భాందవుడుగా మారాడు. సోనూసూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి ఎంతో మంది ఆయనకు అభిమానులాగా మారారు. సోనూను కలిసేందుకు ఎంతో మంది ముంబైకి క్యూ కట్టారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువ ఉన్నారు. ఇటీవల కలిసేందుకు మొన్న ఓ యువకుడు పాదయాత్ర చేశాడు. తనను కలిసేందుకు ఇలాంటి సాహసాలు చేయోద్దని చెప్పినా.. ఆయన అభిమానులు మాత్రం వినడం లేదు.

తాజాగా సోనూను కలిసేందుకు ఓ యువకుడు సైకిల్ యాత్ర చేపట్టాడు. ముంబై వెళ్లి సోనూ సూద్‌ను కలిసి ఓ ఫోటో దిగితే చాలని 8 వందల కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టాడు. నాగర్ కర్నూల్‌కు చెందిన సురేష్ అనే యువకుడు సోనూసూద్‌ను కలిసేందుకు సైకిల్ యాత్ర ప్రారంభించాడు. ప్రస్తుతం వికారాబాద్ జిల్లా పరిగి పట్టణానికి చేరుకున్నాడు. తలపై హెల్మెట్ పెట్టుకుని, తన బ్యాగ్‌తో రోజుకు 60 నుంచి 70 కి.మీ. రోడ్డు మార్గం ద్వారా ప్రయాణిస్తున్నాడు. తన సోదరుడి సహకారంతో బయలుదేరిన తనకు మార్గమధ్యలో సోనూసూద్ అభిమానులు కలిసి పండ్లు, బిస్కట్లు, నీళ్లు అందిస్తున్నారని సురేష్ సంతోషం వ్యక్తం చేశాడు. అయితే, ఈ విషయం సోనూసూద్ కు తెలియడంతో.. అభిమానులు ఇలాంటి సాహసాలు చేయోద్దని విజ్ఞప్తి చేశాడు.

ఇది కూడా చదవండి: షర్మిల పార్టీ జెండా సిద్ధం.. నిరాడంబరంగానే పార్టీ ఆవిర్భావం!

Advertisement

తాజా వార్తలు

Advertisement