Thursday, April 18, 2024

ఎంత చక్కని డ్రామా… నిన్న ఏడ్చాడు ఈరోజు డాన్స్ చేస్తున్నాడు !!

ఎన్నికలు వచ్చిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులు చేసే వేషాలు అన్నీ ఇన్నీ కాదు. కొత్త కొత్త డ్రామా లు ఆడుతూ కనిపిస్తూ ఉంటారు. అయితే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బిజెపి పార్టీ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ తరపున పోటీలో రవి కుమార్ నాయక్ బోరున విలపిస్తూ ఓట్ల కోసం కాళ్ళు మొక్కుతూ జనాలలో నిన్న తిరిగాడు. పోటీ అయితే చేశాను.. నాకు ధైర్యం సరిపోవడం లేదు ఓటు వేయండి అంటూ కన్నీరు పెట్టుకున్నాడు .

అయితే ఈ రోజు మాత్రం జోష్ పెరిగింది. గాత్రిపురారం మండలం అల్వాల పాడు తండాలో ప్రచారం చేసిన ఆయన గిరిజనులతో కలిసి స్టెప్పులు వేశారు. దీంతో నెటిజన్లు నిన్న ఏడ్చిన వీడియోలను ఇప్పుడు డాన్స్ చేసిన వీడియోలను పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement