Friday, April 26, 2024

కోటి మొక్క‌లు నాటుదాం – భూతాపాన్ని అరిక‌డ‌దాంః నాగార్జున‌

హ‌రిత తెలంగాణా కోసం ఎంపీ సంతోష్‌కమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక గంటలో కోటి మొక్కలు నాటే లక్ష్యంతో కోటి వృక్షార్చనకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఈ మహాకార్యంలో తాను పాల్గొనబోతున్నానని..ప్రజలందరూ పాల్గొన్ని జయప్రదం చేయాలని హీరో నాగార్జున పిలుపునిచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన కానుకగా ప్రతి ఒక్కరూ కోటి వృక్షార్చనలో భాగం కావాలని వీడియో సందేశం ద్వారా ప్ర‌జ‌ల‌ను కోరారు. ‘రోజు రోజుకు పెరిగిపోతున్న భూతాపాన్ని అరికట్టాలంటే విరివిగా మొక్కలు నాటాల్సిన అవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉంది. వృక్ష సంరక్షణే ఈ పుడమిని కాపాడుతుంది’ అని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement