Saturday, March 23, 2024

పాలన చేతకాకపోతే జగన్ ఇంట్లో కూర్చోవాలి: నాదెండ్ల మనోహర్

ఏపీ ప్రభుత్వంపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో ఎంతో మంది చనిపోయారని, ఒక్కరి ఇంటికైనా జగన్ వెళ్లారా అని ఆయన ప్రశ్నించారు. పవన్‌ను ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలు చేయిస్తున్నారని నాదెండ్ల ఆరోపించారు. సినిమా పరిశ్రమను నమ్ముకున్న వారిని కాపాడాలని మాత్రమే సినిమా ఫంక్షన్‌లో పవన్ అడిగారని తెలిపారు. ఆ అంశం గురించే ప్రభుత్వాన్ని ప్రశ్నించారని వివరించారు.

ఏపీలో వర్షాలకు రోడ్లు పాడైపోతే పట్టించుకున్న పాపాన పోలేదని నాదెండ్ల విమర్శలు చేశారు. పాలన చేతకాకపోతే జగన్ ఇంట్లో కూర్చోవాలని హితవు పలికారు. జనసైనికులకు పార్టీ అండగా ఉంటుందని, సినిమా పరిశ్రమను కాపాడాలని అడిగితే పవన్‌ను కాపాడాలని అడగడం కాదని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల గురించి అడిగితే.. పనికిమాలిన వ్యక్తులను రెచ్చగొట్టి వ్యక్తిగత విమర్శలు చేయిస్తున్నారని మండిపడ్డారు. పవన్ ఏనాడు పదవుల కోసం ఆరాటపడలేదని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement