Wednesday, April 24, 2024

నా లాస్ట్ శాల‌రీ స్లిప్స్.. ఇంకా నా ద‌గ్గ‌ర ఉంది.. అమితాబ్ బ‌చ్చ‌న్

బాలీవుడ్ స్టార్ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్..పలు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు. ఆయ‌న సినీ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి 50సంవ‌త్స‌రాలు అయింది. దాంతో పాత జ్ఞాప‌కాల్ని గుర్తు చేసుకున్నారు. బాలీవుడ్ లోని టాప్ సెలెబ్రిటీలలో ఒకరుగా ఉన్న అమితాబ్.. గతంలో ఏడుగురితో కలిసి ఓ చిన్న ఇరుకు గదిలో రోజులు గడిపారట. ఈ విషయాన్ని బ్లాగ్ ద్వారా అభిమానులకి తెలియజేశారు. 1968లో అప్పట్లో కోల్‌కతాలో ఉండేవాడ్ని. 10 బై 10 సైజు ఉన్న రూంలో నాతో పాటు ఏడుగురు ఉండేవారు.

సాయంత్రం వేళ నా ఫ్రెండ్స్‌తో కలిసి అక్కడ పాపులర్ రెస్టారెంట్ల దగ్గరికి వెళ్లేవాడ్ని. కానీ.. అందులోకి వెళ్లడానికి సరిపడ డబ్బు మా దగ్గర ఉండేది కాదు. కానీ.. ఎప్పటికైనా ఆ రెస్టారెంట్లలోకి వెళ్లగలిగే స్థాయికి చేరతాననే ఆశ మాత్రం నాలో ఉండేదని చెప్పారు. సినిమాల్లోకి రాక ముందు కోల్‌కతాలోని బ్లాకర్స్ అనే కంపెనీలో అమితాబ్ బచ్చన్ పనిచేశారట. అప్పట్లో నెలకి రూ.1640 జీతం ఆ కంపెనీ వాళ్లు ఇవ్వగా.. 1968, నవంబరు 30న లాస్ట్ శాలరీ తీసుకున్నట్లు బిగ్‌ బి గుర్తు చేసుకున్నారు. ఆ జీతం రసీదు ఇప్పటికీ తన వద్ద భద్రంగా ఉందట. ఆ జాబ్‌కి ముందు ఉద్యోగం లేక చాలా రోజుల పాటు చెప్పులు అరిగేలా రోడ్లపై తిరిగిన విషయాన్ని కూడా బిగ్‌ బి గుర్తు చేసుకున్నారు. అమితాబ్ బచ్చన్ ఇప్పటికీ కోల్‌కతా వెళ్లినప్పుడు తన పాత ఫ్రెండ్స్‌ని కలుస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement