Wednesday, April 24, 2024

విష్ణుప్రియ త‌ల్లి క‌న్నుమూత‌.. ఎమోష‌న‌ల్ నోట్ పోస్ట్ చేసిన యాంక‌ర్

విషాదంలో మునిగిపోయింది యాంక‌ర్..న‌టి విష్ణుప్రియ..ఆమె త‌ల్లి క‌న్నుమూశారు. ఈ విషయాన్ని విష్ణు ప్రియా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపింది. ఈ సందర్భంగా తన తల్లితో కలిసి ఉన్న ఫొటో షేర్ చేస్తూ .. ‘మై డియర్ అమ్మ.. ఈ రోజు వరకు నాకు తోడుగా ఉన్నందుకు నీకు ధన్యవాదాలు. నేను తుది శ్వాస విడిచే వరకు నీ పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తాను. నువ్వు నా బలం.. నువ్వే నా బలహీనత. ప్రస్తుతం నువ్వు ఈ అనంత విశ్వంలో కలిసిపోయావు. నువ్వు ప్రతిచోట, నా ప్రతి శ్వాసలో ఉంటావని నాకు తెలుసు. ఈ ప్రపంచంలో నాకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించడానికి నువ్వు ఎన్ని ఇక్కట్లు పడ్డావో నాకు తెలుసు. అందుకు నేను నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. రెస్ట్ ఇన్ పీస్ అమ్మా.. అంటూ ఎమోషనలైంది విష్ణుప్రియ. కాగా ఈ వార్త తెలుసుకున్న బుల్లితెర నటీనటులు, యాంకర్లు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. విష్ణుప్రియ ఫ్యామిలీ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement