Sunday, March 24, 2024

Breaking | హైద‌రాబాద్ బోయిన్‌ప‌ల్లిలో మ‌ర్డ‌ర్‌.. రియ‌ల్ వ్యాపారిపై క‌త్తితో అటాక్‌

హైద‌రాబాద్‌లోని బోయినపల్లిలో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి మహమ్మద్‌ సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యాడు. బార్కస్‌కు చెందిన ఫైజుద్దీన్‌ అనే మ‌రో రియ‌ల్ వ్యాపారి ఇత‌డిని హతమార్చినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే, ఇద్దరి మధ్య కొద్ది రోజులుగా గొడవలు ఉన్నాయని, ఈ క్రమంలోనే మ‌ర్డ‌ర్ జ‌రిగి ఉంటుంద‌ని పోలీసులు ప్రాథ‌మిక నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.

సిద్ధిఖీ ఇంట్లో ఉండగా.. అక్కడికి వచ్చిన ఫైజుద్దీన్‌ కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలతో సిద్ధిఖీ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థ‌లాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ మ‌ర్డ‌ర్‌కి సంబంధించిన‌ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement