Sunday, April 14, 2024

Munugodu bypoll: తులం బంగారం ఇవ్వకుంటే ఓటేయం… బీజేపీకి ఓట‌ర్ల షాక్ !!

మరికొన్ని గంటల్లో ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో అనుహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రేపు ఎన్నికల జరుగనుండగా ఈరోజు బీజేపీ కి ఓటర్లు షాక్‌ ఇచ్చారు. మునుగోడు నియోజకవర్గంలోని కొరటికల్ గ్రామంలో ఓట‌ర్లు ఆందోళనకు దిగారు. అస‌లు విష‌యం ఏమిటంటే బీజేపీకి ఓటేస్తే తులం బంగారంతోపాటు ప‌ది వేల రూపాయ‌లు ఇస్తామ‌ని బీజేపీ ప్ర‌చారం చేసింది. అయితే తమకు బంగారం ఇవ్వకుండా రూ.3 వేలు మాత్రమే ఇచ్చారంటూ బీజేపీ నేతలను ఓటర్లు నిలదీశారు. తులం బంగారం ఇవ్వకుంటే ఓటు వేయబోమని హెచ్చరించారు. ఓటర్లు ఊరు ఊరంతా ఏకమై నేతలపై తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఓటర్లకు సర్ది చెప్పలేక నేతలు తలలు పట్టుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement