Thursday, April 25, 2024

Munugode bypoll results: ఆరో రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌దే ఆధిక్యం

మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్ర‌శాంతంగా సాగుతోంది. దాదాపు అన్ని రౌండ్ల‌లో టీఆర్ఎస్ ఆధిక్యంలోనే ఉంది. చౌటుప్ప‌ల్ లో బీజేపీ ఆశ‌లు పెట్టుకోగా.. అక్క‌డ కూడా టీఆర్ఎస్ స్వ‌ల్ప మెజారిటీతో ముందంజ‌లో ఉంది. ఆరు రౌండ్లు ముగిసే సరికి 2169 ఓట్ల మెజార్టీలో ఉన్నది. ఆరో రౌండ్‌లో పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డికి 6016 ఓట్లు పోలవగా, బీజేపీకి 5378, కాంగ్రెస్‌ పార్టీకి 1831 ఓట్లు వచ్చాయి. ఆరో రౌండ్‌లో తన సమీప ప్రత్యర్థి కంటే కూసుకుంట్ల 638 ఓట్లు అధికంగా సాధించారు. ప్రస్తుతం ఏడో రౌండ్‌ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఇప్పటివరకు 95 ఓట్ల లెక్కింపు పూర్తవగా, మరో లక్షా 30 ఓట్లు లెక్కించాల్సి ఉన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement