Thursday, March 28, 2024

ముంబైలో నిర్భయ తరహా ఘటన.. మహిళపై పాశవికంగా అత్యాచారం

దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో నిర్భయ తరహా ఘటన చోటుచేసుకుంది. ముంబైలోని సకినాక ప్రాంతంలో 32 ఏళ్ల మహిళపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. దులుతున్న టెంపోలోనే అత్యాచారం చేసి, ఆమె పట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. ఆమె ప్రైవేటు భాగాల్లోకి ఇనుప రాడ్డు చొప్పించారు. పోలీసుల కథనం ప్రకారం.. సకినాక ప్రాంతంలోని ఖైరానీ రోడ్డులో ఓ మహిళ అపస్మారక స్థితిలో పడి ఉన్నట్టు శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

రోడ్డు పక్కన పడివున్న మహిళను గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ఆమెకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెపై అత్యాచారానికి పాల్పడిన దుండగులు రహస్య భాగంలోకి రాడ్డును చొప్పించినట్టు గుర్తించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తోన్న మోహన్ చౌహన్ (45) అనే వ్యక్తిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. ఈ ఘటనలో మరికొందరి ప్రమేయం ఉందని అనుమానిస్తున్న పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. నిదింతుడిపై హత్యాయత్నం, అత్యాచారం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇది కూడా చదవండిః వెంటిలేటర్ పై సాయి ధరమ్ చికిత్స.. వైద్యులు ఏమన్నారంటే..

Advertisement

తాజా వార్తలు

Advertisement