Tuesday, April 23, 2024

ఏడుస్తున్న ఫొటో పోస్ట్ చేసిన.. మృణాల్ ఠాకూర్

ఏడుస్తున్న ఫొటోని పోస్ట్ చేసింది హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్.. తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోలో మృణాల్ ఠాకూర్ ఏడుస్తూ కనిపించింది. అయితే, గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను వివరించేందుకే నటి ఆ ఫోటోను షేర్ చేసింది. మృణాల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఇలా రాసుకొచ్చింది. నిన్న చాలా కష్టంగా గడిచింది. కానీ ఈ రోజు నేను చాలా సంతోషంగా, ధైర్యంగా ఉన్నా. ప్రతి ఒక్కరికి వారి కథలో కొన్ని పేజీలు ఉంటాయి. కానీ వాటిని అందరితో పంచుకునేందుకు ఆసక్తి చూపరు. నేను వాటిని అందరితో పంచుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే నేను నేర్చుకున్న పాఠాన్ని ఇతరులకు నేర్పాలి’ అంటూ రాసుకొచ్చింది. పోస్ట్‌కు ఏడుస్తున్న ఫొటోను జత చేసింది.ఇది చూసిన ఆమె అభిమానులు ఏం జరిగిందో అని కంగారుపడిపోతున్నారు. ‘మేడం ఎందుకు ఏడుస్తున్నారు.. అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ.. ‘ఆ పోస్ట్‌లో నేను పెట్టిన ఫొటో.. ఇప్పటిది కాదు. గతంలో నాకు కఠిన పరిస్థితులు ఎదురైన రోజుల్లో ఆ ఫొటో తీసుకున్నా. కానీ ఇప్పుడు నేను చాలా సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నా అంటూ వివరణ ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement